MS8NEWS జనవరి 20 :లింగాపూర్ / హౌసింగ్ బోర్డ్ కాలనీ:రాబోయే మున్సిపల్ ఎన్నికలలో 29వ డివిజన్ (లింగాపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ) నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా నిమ్మరాజుల రజిని రవి పోటీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా వారు డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజల ఆశీర్వాదం కోరుతూ..”లింగాపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ మరియు ఇందిరమ్మ కాలనీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ డివిజన్ అభివృద్ధిలో భాగస్వామిని కావాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్న నన్ను ఆదరించి, మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను.” అని రజిని రవి పేర్కొన్నారు.
అభివృద్ధి ప్రణాళిక:కాలనీల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం.పరిశుభ్రమైన మరియు ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దడం.”మీ ఇంటి బిడ్డగా, మీ కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తిగా నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాను” అని వారు విజ్ఞప్తి చేశారు.

