(MS8NEWS జనవరి 12):సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత
సఫిల్గూడ కట్టమైసమ్మ గుడి వద్ద అపచారం: ఆలయ ప్రాంగణంలో మల విసర్జన చేసిన వ్యక్తి.
నిందితుడికి దేహశుద్ధి: ఘటనను గమనించి నిందితుడిని పట్టుకుని చితకబాదిన బీజేపీ, భజరంగ్ దళ్ నాయకులు.
రంగంలోకి పోలీసులు: సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారంటూ బీజేవైఎం, భజరంగ్ దళ్ కార్యకర్తల భారీ ఆందోళన. నిందితుడు స్థానికుడు కాదని, అతను రోహింగ్యా అయి ఉండవచ్చని హిందూ సంఘాల నేతల ఆరోపణ.కట్టమైసమ్మ ఆలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం.హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భానుప్రకాశ్ మండిపాటు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.

