(MS8NEWS జనవరి 7):రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు.రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదని పిటిషన్ దాఖలు.యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో రూ.1.50 లక్షల రుణం తీసుకున్న నరసింహారెడ్డి అనే రైతు.కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

