(MS8NEWS జనవరి 2):ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ మధ్య మొదలైన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ చేసిన కొన్ని కామెంట్స్ ఈ వివాదానికి మూలమయ్యాయి.ఈ వ్యవహారంపై గరికపాటి నరసింహారావు గారు ఘాటుగా స్పందించారు. ఆయన వ్యక్తం చేసిన ప్రధానాంశాలు ఇవే:
సమాజం ఛీత్కరించుకోవాలి: తప్పు చేసిన వ్యక్తికి చట్టపరమైన శిక్ష కంటే, సమాజం అతడిని అసహ్యించుకున్నప్పుడే నిజమైన మార్పు వస్తుందని ఆయన హితవు పలికారు.సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అసభ్యతపై సమాజం గళం ఎత్తాలని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.మచ్చలేని వ్యక్తులపై బురద జల్లడం సరికాదని, ఇలాంటి ప్రవర్తనను తన అభిమానులు ఎంతమాత్రం సహించరని స్పష్టం చేశారు. ఈ వివాదంలో ధర్మానికి మరియు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వివాదం నేపథ్యం:యూట్యూబర్ అన్వేష్ ఒక వీడియోలో గరికపాటి నరసింహారావు గారిని ఉద్దేశించి, అలాగే హిందూ దేవతలపై (సీతమ్మ తల్లిపై) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, అన్వేష్పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.ప్రస్తుతం ఈ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి చర్చించుకుంటున్నారు. గరికపాటి గారి వ్యాఖ్యలు సంప్రదాయవాదుల నుంచి గొప్ప మద్దతు పొందుతున్నాయి.

