MS8NEWS రామగుండం 15/12/2025:రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ గోదావరిఖని గోదావరి ఒడ్డున పునర్ నిర్మాణం చేపడుతున్న సమ్మక్క–సారలమ్మ గద్దల పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, పనులు వేగంగా మరియు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. రాబోయే సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

