(MS8NEWS జనవరి 6):గోదావరిఖని:స్థానిక శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శైలేందర్ ఠాకూర్ స్మారకార్థం అయ్యప్ప స్వాములకు బిక్ష (అన్నదానం) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సోదరులు, కీర్తిశేషులు శైలేందర్ ఠాకూర్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. వారు స్వయంగా అయ్యప్ప స్వాములకు బిక్ష వడ్డించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శైలేందర్ ఠాకూర్ జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

