(MS8NEWS డిసెంబర్ 18): ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించబడనున్న *జాతీయ మెగా లోక్ అదాలత్* ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ,లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా సామరస్యంతో సమస్యల ముగింపు పలకాలి అనీ, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
*రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన, కుటుంబపరమైన మరియు వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్* వంటి కేసుల్లో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకుని రాజీకి రావచ్చు.
*”రాజీయే రాజమార్గం”* చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేయవద్దు. జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశం ద్వారా ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలి” అని కమిషనర్ సూచించారు.
పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు మరియు పోలీస్ సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి, రాజీ పడదగిన కేసులను గుర్తించాలి. ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు. తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు.
*లోక్ అదాలత్ గురించి ప్రజలకు సూచనలు:*
– ఇరుపక్షాల సమ్మతితో మాత్రమే రాజీ సాధ్యం.
– లోక్ అదాలత్లో జరిగిన రాజీ *చట్టపరంగా తుది తీర్పు* గా పరిగణించబడుతుంది. –
ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సోషల్ వర్కర్స్ సమన్వయంతో పరిష్కారం జరుగుతుంది.
“ప్రజలు, పోలీస్లు, న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే, చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించవచ్చు,” అని *సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.*

