MS8NEWS గోదావరిఖని, జనవరి 20:ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయే స్థితిలో ఉన్న ఒక పేద విద్యార్థికి నాయకుల చొరవతో భరోసా లభించింది. గోదావరిఖని ఎల్బి నగర్ (53వ డివిజన్)కు చెందిన చింతకింది రుత్విక్ అనే విద్యార్థి విద్యాభ్యాసం కొనసాగించేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు ఐఏఎస్ అధికారి కలిసి మొత్తం రూ. 60,000/- ఆర్థిక సహాయాన్ని అందించారు.రుత్విక్ పరిస్థితిని తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్లా హరీష్ రెడ్డి స్పందించి, తన వంతుగా రూ. 20,000/- నగదును అందించారు. అదేవిధంగా, నరహరి ఐఏఎస్ ప్రత్యేక చొరవ తీసుకుని, విద్యా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి మరో రూ. 40,000/- రాయితీని/సహాయాన్ని ఇప్పించారు. వెరసి రూ. 60,000/- సహాయంతో ఆ విద్యార్థి భవిష్యత్తుకు మార్గం సుగమమైంది.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అయిత శివ కుమార్ మాట్లాడుతూ.. “హరీష్ రెడ్డి మరియు నరహరి ఐఏఎస్ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం న్యాయం జరుగుతోంది. విద్య, వైద్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో వీరి చొరవ అభినందనీయం. ఒక విద్యార్థి కలకు దారి చూపడం సమాజానికి స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.తమ బిడ్డ చదువుకు ఆసరాగా నిలిచినందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు మరియు 53వ డివిజన్ ప్రజలు హరీష్ రెడ్డికి, నరహరి ఐఏఎస్ కీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

