MS8NEWS జనవరి 19మేడారం : భక్తులకు అందుబాటులోకి ఆర్టీసీ బస్సు చార్జీల వివరాలు!
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుండి మేడారానికి నడిపే బస్సుల చార్జీల వివరాలను తాజాగా విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం సాధారణ ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు డీలక్స్, సూపర్ లగ్జరీ మరియు రాజధాని బస్సులను కూడా అందుబాటులో ఉంచింది.
ప్రధాన నగరాల నుండి చార్జీల వివరాలు (రూపాయల్లో):జాతర సందర్భంగా వివిధ రకాల బస్సుల్లో నిర్ణయించిన చార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
హైదరాబాద్ నుండి:
ఎక్స్ప్రెస్: రూ. 600
సెమీ డీలక్స్: రూ. 650
డీలక్స్: రూ. 680
సూపర్ లగ్జరీ: రూ. 770
రాజధాని: రూ. 960
గరుడ ప్లస్: రూ. 1110
హన్మకొండ నుండి:
ఎక్స్ప్రెస్: రూ. 250
సెమీ డీలక్స్: రూ. 270
డీలక్స్: రూ. 300
సూపర్ లగ్జరీ: రూ. 350
రాజధాని: రూ. 450
గరుడ ప్లస్: రూ. 500
వరంగల్ / కాజీపేట నుండి:
ఎక్స్ప్రెస్: రూ. 250
సెమీ డీలక్స్: రూ. 270
డీలక్స్: రూ. 450
సూపర్ లగ్జరీ: రూ. 500
ముఖ్యమైన ఇతర ప్రాంతాల ఎక్స్ప్రెస్ చార్జీలు:
జనగామ: రూ. 400
మహబూబాబాద్: రూ. 360
కరీంనగర్: రూ. 390
ఖమ్మం: రూ. 480
మంచిర్యాల: రూ. 440
గోదావరిఖని: రూ. 400
ములుగు: రూ. 160
ఏటూరునాగారం: రూ. 80
తాడ్వాయి: రూ. 60
పస్రా: రూ. 80
గోవిందరావుపేట: రూ. 100
సిరోంచ (మహారాష్ట్ర): రూ. 400

