MS8NEWS ఫిబ్రవరి 8: రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల సౌలభ్యార్ధం ఎన్ టి పి సి (టి టి ఎస్) ఎంప్లాయీ డెవలప్మెంట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్ లో మొదటి రోజైన శనివారం అన్ని డివిజన్ లకు కలిపి 116 ఓట్లు పోలయ్యాయి . ధరఖాస్తు చేసుకున్నవారితో పాటు కొత్తగా ధరఖాస్తు చేసుకునే వారు సైతం ఆఖరి రోజైన ఫిబ్రవరి 8 ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల లోపు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్ సందర్శించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ కోరారు.

