తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి, ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లకు రేపు, ఎల్లుండి, సెలవులు ఉండనున్నాయి.ఈ మూడో విడతలో 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన స్థానాలకు బుధవారం ఉదయం పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లకు రేపు, ఎల్లుండి, సెలవులు ఉండనున్నాయి. అలాగే ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది. తెలంగాణలో మూడో విడత పోలింగ్ జరిగే గ్రామా ల్లో ఈరోజు సాయంత్రం ప్రచారానికి తెర పడనుంది, రేపు మంగళవారం పోలింగ్ హడావుడి మొదలు కానుంది.

