Wednesday, February 11, 2026

నటుడు శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది..

(MS8NEWS డిసెంబర్ 25):నటుడు శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది

ఇటీవల జరిగిన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. “సామాన్లు అన్నీ కనిపించేలా బట్టలు వేసుకోవద్దు” అంటూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, మహిళా సంఘాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి.ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, శివాజీకి నోటీసులు పంపారు.

  • హాజరు కావాల్సిన సమయం: ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు. కమిషన్ ముందు స్వయంగా హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

శివాజీ స్పందన

​నోటీసులు అందిన నేపథ్యంలో శివాజీ స్పందిస్తూ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ, తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, అయినప్పటికీ ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే హృదయపూర్వకంగా క్షమించాలని కోరారు.ఈ నెల 27న ఆయన కమిషన్ ముందు హాజరై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Related Articles

Most Popular