Sunday, April 12, 2026

అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొడతాం: మడిపెల్లి మల్లేష్ ధ్వజం – దళితుడు ఎదగడం ఇష్టం లేకే రాజకీయ సమాధికి యత్నం – బెదిరింపుల ఆరోపణల్లో వాస్తవం లేదు.. అంతా దుష్ప్రచారమే మడిపెల్లి మల్లేష్

 

MS8NEWS ఫిబ్రవరి 3 రామగుండం : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దళిత వర్గానికి చెందిన వ్యక్తి రాజకీయంగా ఎదగడాన్ని సహించలేక కొన్ని అగ్రవర్ణ శక్తులు తనను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నాయని మడిపెల్లి మల్లేష్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన తన అనుచరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను ప్రజల ముందు ఉంచారు.

అణగారిన వర్గాల గొంతుకను నొక్కే ప్రయత్నం: “ఒక దళితుడు ఏకగ్రీవంగా ఎన్నికవడాన్ని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. నా రాజకీయ సమాధి చేయడమే లక్ష్యంగా అగ్రవర్ణ కుట్రదారులు పావులు కదుపుతున్నారు” అని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు.

బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: తాను గానీ, తన అనుచరులు గానీ ఓటర్లను లేదా ప్రత్యర్థులను బెదిరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. “మాకు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదు. మా బలం ప్రజలు, మా ఆయుధం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రతి పౌరుడికి ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు” అని ఆయన నొక్కి చెప్పారు.

పదవుల కోసం కాదు.. ప్రజల కోసం: తాను పదవిని ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, పేద, బడుగు, బలహీన వర్గాల సేవ కోసం నిరంతరం శ్రమిస్తున్నానని మల్లేష్ పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు, వారి ఒత్తిడి మేరకే తాను ఈ ఎన్నికల బరిలో నిలిచానని, తన ఆశయం కేవలం డివిజన్ అభివృద్ధి మరియు సామాన్యుడి గొంతుకగా నిలవడమేనని వివరించారు. ఈ కుట్రలను ఛేదించి, ప్రజలే తనకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Most Popular